Friday, April 26, 2024

మృతుల కుటుంబాలకు మంత్రి హ‌రీశ్ రావు పరామర్శ

సిద్దిపేట ప్రతినిధి : నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం రాముని పట్ల గ్రామానికి చెందిన టి ఆర్ ఎస్ వి మండల ప్రధాన కార్యదర్శి గుజ్జరాజు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించి వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు సుధాకర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.. ఆయన కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించి నేనున్నాంటూ భరోసానిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement