Thursday, April 18, 2024

కేంద్రం ఆంక్షల వల్లే వ్యాక్సినేషన్‌లో జాప్యం: హరీష్‌రావు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దేశీయ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ముందస్తుగా చెల్లించినా, చివరకు గ్లోబల్ టెండర్లు పిలిచినా కేంద్రం నిబంధనలతో కావాల్సినంత వ్యాక్సిన్‌ తెచ్చుకోలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ కరోనా టీకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement