Monday, April 29, 2024

ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యయత్నం

సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణిలో వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడ్డ సంఘటన సిద్దిపేట కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం దుద్దెడ, రాంపల్లి శివారులోని సర్వే నంబర్ 663, 143లో భూమిని రైతుల నుండి తీసుకుంద‌ని, అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి భూమి కోల్పోయిన వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం, 200 గజాల ప్లాటు, బోరు బావులకు, పండ్ల తోటలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై వారు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని సదరు వ్యక్తి అన్నారు. దీంతో అశ్వదాము అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు య‌త్నించ‌గా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement