Friday, May 3, 2024

Mayavathi : తెలంగాణలో మాయ‌వ‌తి ఎన్నిక‌ల ప్ర‌చారం

బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రెండు రోజులు తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంత‌రం సూర్యాపేటలో జరగనున్న ర్యాలీ, బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సభ అనంతరం హైదరాబాద్ చేరుకోని ఓ హోటల్లో బస చేస్తారని, ముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం పెద్దపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement