Saturday, April 20, 2024

Breaking: వివాహిత ఆత్మహత్య?.. భర్తే చంపేశాడు అంటున్న బంధువులు

రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఇవ్వాల (బుధవారం) రాత్రి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆందోళనకు దిగారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఉంటున్న మమత తన ఇంట్లోనే పైకప్పుకు ఉరేసుకుని చనిపోయింది. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు ఇది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement