Wednesday, May 22, 2024

TS: కాంగ్రెస్ ఖాతాలో మంథ‌ని…మున్సిప‌ల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్​పై 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్​ఎస్​కు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై ఈనెల 1వ తేదీన పెద్దపల్లి కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని ఆర్డీవో, ప్రిసైడింగ్ అధికారి హనుమానాయక్ అధ్యక్షతన అవిశ్వాసంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. మంథని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement