Wednesday, May 1, 2024

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌.. ఒకరు మృతి

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో శనివారం తెల్లవారుజామున ఓ బైకు ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మరణించాడు. ధర్మపురికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి.. కోరుట్లలో బీడీ ప్యాకింగ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇవాళ ఉదయం విధులకు వెళ్తూ.. ధర్మపురిలో ఓ బైక్‌ను లిఫ్ట్‌ అడిగాడు. కోరుట్ల వెళ్తుండగా నేరెళ్ల సమీపంలో బైక్‌ ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టింది. ఎడ్లబండి బైక్‌పై పడింది. దీంతో వెనక కూర్చున్న చంద్రయ్యపై అక్కడికక్కడే మృతిచెందాడు. ఎడ్ల బండిపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement