Friday, May 17, 2024

Breaking: తార్నాకలో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి..

హైదరాబాద్​: తార్నాక చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌స్పెక్ట‌ర్‌ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చంగిచర్ల ప్రాంతానికి చెందిన కడప కోటేశ్వర్ (55) వృత్తి రీత్యా టైలర్ పని చేసుకుంటాడు. సోమవారం సికింద్రాబాద్ నుండి ఉప్పల్ వెళ్తుండగా, వెనకాలే వస్తున్న జీ.హెచ్.ఎం.సి చెత్త లారీ లాలపేట్ వైపు వెళ్లే క్రమంలో తార్నాక చౌరస్తాలో స్కూటీని ఢీకొట్టింది. దీంతో కోటేశ్వర్ స్పాట్ లోనే చ‌నిపోయాడు.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలకు హెల్మెట్ దరించలేని కారణంగానే అత‌ను స్పాట్ లో చ‌నిపోయాడ‌ని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదం త‌ప్పేద‌ని సీఐ రమేష్ నాయక్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement