Monday, July 22, 2024

MBNR : రిటైర్డ్‌ ఎస్‌ఈ రంగారెడ్డి మృతి తీరని లోటుః ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట మే 28, ప్రభ న్యూస్ః నీటిపారుదల ప్రాజెక్టుల సలహాదారు రిటైర్డ్‌ ఏస్‌ఈ ఎన్‌.రంగారెడ్డి మృతి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని లోటు అని అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. నీటిపారుదల సలహాదారు, రిటైర్డ్‌ మాజీ ఎస్‌ఈ ఎన్‌. రంగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మేల్యే వంశీకృష్ణ హైదరాబాద్‌లోని వారి స్వగృహానికి వెళ్లి రంగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిన గొప్ప ఇంజనీయర్‌ ఎన్‌. రంగారెడ్డి అని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఎంతో కృషి చేశార‌న్నారు. కే ఎల్‌ ఐ, పాలమూరు-రంగారెడ్డి, భీమా, కోయిల్‌ సాగర్‌ లాంటి ప్రాజెక్టుల రూపకల్పనలో రంగారెడ్డి పాత్ర ఎంతో కీలకమని, ఆయన చేసిన కృషి వెలకట్టలేనివని అన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి నేటి వరకు ఆయనతో మంచి సత్సంబంధాలు వుండేవని గుర్తుకు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement