Sunday, April 28, 2024

MBNR : శ్రీ‌రామునికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

మక్తల్, ఏప్రిల్17(ప్రభన్యూస్): మ‌క్త‌ల్‌లోగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం సంద‌ర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను మొసుకొని వచ్చి రామ్ లీలా మైదానంలో రాముల వారి కల్యాణ మండపంలో అర్చకులకు అందజేశారు.

- Advertisement -

రాంలీలా మైదానంలో వేలాదిమంది భక్తుల మధ్య జరగనున్న స్వామి వారి కల్యాణానికి ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు. వారితోపాటు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి మంజుల దంపతులు దామోదర జ్యువెలర్స్ యజమాని తాళంపల్లి రమేష్ దంపతులు స్వామి వారికి పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement