Thursday, July 25, 2024

TS : అంత్యక్రియలకు వెళ్తూ…. అనంత లోకాలకు

మక్తల్, మే28(ప్రభన్యూస్): నారాయ‌ణ‌పేట జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. సహచర వీడియో గ్రాఫర్ తల్లీ మృతి చెందడంతో అంత్యక్రియల కోసం వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు ఫోటో, వీడియో గ్రాఫర్లు దుర్మరణం చెందారు. ఈ ప్ర‌మాదంలో మరొక యువకుడు తీవ్ర గాయలపాల‌య్యాడు.

- Advertisement -

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుండి ఫోటో వీడియో గ్రాఫర్స్ రాఘవేంద్ర చారి (రఘు) మున్నూరు వెంకటేష్ లు మరో యువకుడితో కలిసి ధన్వాడ మండలం పూసల్ పాడ్ గ్రామంలో వీడియో గ్రాఫర్ రవి తల్లీ అంత్యక్రియలకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా మక్తల్ పట్టణ శివారులోని దండు వద్ద కర్ణాటక కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రఘు, మున్నూరు వెంకటేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో యువకుడు చికిత్స నిమిత్తం మహబూబ్​నగర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement