Wednesday, May 1, 2024

TS : 10 జీపీఎ సాధించండి… 10 తులాల వెండి పొందండి

మక్తల్, మార్చి18(ప్రభన్యూస్) : మక్తల్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 10 జిపిఎ సాధించిన ప్రతి విద్యార్థికి 10 తులాలు వెండి మెడల్‌ను బహుకరించనున్నట్లు బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో బికేఆర్ ఫౌండేషన్ ద్వారా పదవ తరగతిలో 10 జిపిఏ ఎంతమంది సాధిస్తే అంతమంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పది తులాల వెండిని అందించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా ఉన్నత చదువుల కోసం నిరుపేద విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం కూడా అందజేయబడుతుందని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందకుండా సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా పది పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఎ సాధించిన విద్యార్థులకు మాత్రమే వెండి మెడల్స్ ను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement