Friday, May 3, 2024

TS : జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పరీక్షలు… 144సెక్షన్​..

గద్వాలప్రతినిధి, మార్చి 18 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా సోమ‌వారం ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. జిల్లాలో మొత్తం పరీక్ష కేంద్రాలు 41 ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప‌రీక్ష రాస్తున్న స‌మ‌యంలో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప‌రీక్ష కేంద్రాల ప‌రిస‌రాల్లో 144సెక్ష‌న్‌ను విధించారు.

కాగా, విద్యార్థులు పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రాస్తుండ‌డంతో ఆల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను దేవుని దగ్గర పెట్టి మొక్కుకునీ పరీక్ష రాసేందుకు వెళ్లారు. విద్యార్థులను 9 గంటలకే పరీక్ష వ్రాసే కేంద్రాల్లోకి పంపారు. ఎగ్జామ్స్ సెంటర్లోకి వెళ్లే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement