Wednesday, May 1, 2024

MBNR: మక్తల్ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో 1288 మంది సిబ్బంది

మక్తల్, నవంబర్29 (ప్రభ న్యూస్) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గంలో గురువారం జరిగే పోలింగ్ కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 1288 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో మొత్తం 284 పోలింగ్ బూత్ లకు గానూ అధికారులు 35రూట్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో 1 పీఓ , 1ఏపీఓ, ఇద్దరు ఓపీపీవోలు మొత్తం 1,136మంది ఎన్నికల విధులకు హాజరయ్యారు.

152 మంది ఉద్యోగులు రిజర్వుడులో ఉంచారు. 35 రూట్ లకు ఒక్కో రోడ్డుకు ఒక్కో సెక్టోరియల్ ఆఫీసర్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. రిజర్వుడు ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 1,288 మంది విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ సిబ్బందికి ఓటరు లిస్టు ఇతర సామాగ్రి అందజేశారు. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లే ముందు ఈవీఎంలు అందజేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement