Friday, May 3, 2024

Case file: ఓటుకు ల‌క్ష‌…కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ – తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్ పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్‌ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 171 సి, 188, 123 ఆర్‌పీ యాక్ట్‌ కింద కేసులు బుక్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement