Sunday, April 28, 2024

MLCs: ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ‌స్వీక‌రాం చేయ‌నున్న‌ కోదండ‌రాం, అమీర్ ఆలీఖాన్‌

ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల చేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సోమ‌వారం నాడే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలికి వెళ్లిన ప్రొఫెసర్​ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది.

చివరకు ప్రమాణం చేయకుండానే వీరు ఇరువురు వెనుదిరిగి వెళ్లిపోయారు. మండలి చైర్మన్ ​కు సమాచారం ఇవ్వకుండా రావడం వల్ల ఇలా జరిగిందన్నారు. అయితే, శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డితో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లు ఫోన్​లో సంప్రదించినా ఆయన టచ్​లోకి రాలేదని చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం.. ఈ క్రమంలోనే మండలి చైర్మన్​ అందుబాటులో లేరని టాక్. దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తామనే విషయాన్ని చైర్మన్ కు చేరవేయాలని మండలి సెక్రటరీకి ఎమ్మెల్సీలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement