Sunday, April 28, 2024

KHM: పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పోట్లపల్లి సర్పంచ్

పినపాక, ప్రభన్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పొట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తోలెం కళ్యాణితో పాటు పలువురు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటి కో చైర్మన్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయన వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఅర్ఎస్ పార్టీ పతనం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా పినపాక మండలం నుండి మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement