Wednesday, May 15, 2024

జయశంకర్‌ సార్‌ చిరస్మరణీయుడు : మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రొ.జ‌య‌శంక‌ర్ సార్‌ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం దంసలాపురం సర్కిల్ నందు ఆయ‌న విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్ చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement