Sunday, April 28, 2024

TS: ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ముగ్గురికి తీవ్రగాయాలు

బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, ముసలిమడుగు బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబా బాద్ నుంచి వస్తున్న ఆటోని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుకనుంచి బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా… ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని హుటాహుటిన ఖమ్మం తరలించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాబాద్ నుంచి వస్తున్న టీఎస్ 28 టి 7306 నెంబర్ గల ప్యాసింజర్ ఆటో మహబూబా బాద్ నుంచి వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే శ్రీకృష్ణ ట్రావెల్ కు చెందిన ప్రైవేట్ బస్సు వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర కాయాలు కాగా.. ఆటో నడుపుతున్న చిన్నూరు సతీష్ కి తలకు, వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు సతీష్ కి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో బాధితుడి తల్లి చెన్నూరు వెంకటరమణ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement