Sunday, May 19, 2024

Union Minister: కేంద్ర పథకాలను పక్కదారి పట్టిస్తున్న కేసీఆర్… పురుషోత్తం రూపాల

బిక్కనూర్, జూన్ 24 ప్రభా న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా పూర్వ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆయన సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… పార్టీలో నిస్వార్థంగా ఎంతోమంది పనిచేయడం వల్ల దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని తెలిపారు.

భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి మళ్ళీ ప్రధాని కాబోతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పార్టీకి సేవచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. వాటిని సీఎం కేసీఆర్ పక్కదారి పట్టిస్తూ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కేంద్ర పథకాలను ఇంటింటా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేయకుండా కేసీఆర్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు నీలం రాజు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement