Tuesday, April 30, 2024

TS | సింగరేణిని ప్రైవేటీకరించాలన్న కేంద్రం కుట్రలను అడ్డుకున్న కేసీఆర్‌: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ , ఆంధ్రప్రభ : ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం చేయాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్రలను సీఎం కేసీఆర్‌ అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అనీ, అందుకే దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించని విధంగా అత్యధిక బోనస్‌ ప్రకటించి కార్మికుల మన్ననలు పొందారని తెలిపారు. బుధవారం సింగరేణి టీబీజీకేఎస్‌ సంఘం నేతలు కవితను ఆమె నివాసంలో కలిశారు. సింగరేణి కార్మికుల సమస్యలు, లాభాల బాట పట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడారు.

సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని, అందుకే సంస్థ తరపున సీఎంతో పాటు అందుకు సహకరించిన కవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఎప్పుడు మరచిపోబోరని చెప్పారు.

అవకాశం ఉన్న ప్రతిసారి కార్మికులకు ప్రయోజనం కల్పిస్తున్నారని గుర్తు చేశారు. 2014 లో కార్మికులకు 18 శాతం బోనస్‌ ఉండగా, 2022 నాటికి 30 శాతానికి పెంచామని, 2023 కి 32 శాతానికి పెంచినట్లు తెలిపారు.ఈ సమావేశంలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీకేఎస్‌ నేతలు రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితరులు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement