Tuesday, July 23, 2024

భవన నిర్మాణ కార్మికులకు తోడ్పాటు.. సిఐ జగదీష్

సుల్తానాబాద్ (ప్రభ న్యూస్) : భవన నిర్మాణ కార్మికులకు పోలీస్ శాఖ తోడ్పాటు అందిస్తుందని సుల్తానాబాద్ సీఐ జగదీష్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. కష్టతరమైన పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, శ్రీనివాస్, అశోక్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement