Tuesday, April 30, 2024

TS : వైభవంగా రాములోరి కల్యాణోత్సవం…హాజరైన అశేష భక్తజనం

ఇల్లందకుంట, ప్రభ న్యూస్ః అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల పారవశ్యాల మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.

- Advertisement -

తెల్లవారుజాము నుండే సీతారాములను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామివారి కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement