Monday, May 6, 2024

Peddapalli: బజ్జీలు వేసి.. ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్యే తనయుడు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు
బజ్జీలు వేసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత 60 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి 9సంవత్సరాల్లో జరిగిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు.

పెద్దపల్లిలో మూడోసారి కూడా కారు గుర్తుకు ఓటేసి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాల్లో ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటిసంపతి యాదవ్, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, నాయకులు యాదవ్, జంగ రమణారెడ్డి, ఈర్ల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement