Saturday, May 18, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు

సుల్తానాబాద్, ఆగస్ట్ 11(ప్రభ న్యూస్ ) : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి సమీపాన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.ఆయన కథనం ప్రకారం కరీంనగర్ కు చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై సుల్తానాబాద్ వైపు వస్తుండగా ముందుగా వెళుతున్న వాహనాన్ని అతివేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలో వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు చెల్లాచెదురుగా పడిపోయారని ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు యువకులను తీవ్ర గాయాల పాలయ్యారని గాయాలైన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు కరీంనగర్ హౌజి౦గ్ బోర్డు కాలనీకి చెందిన మల్యాల శివమణి (18 ) పియాజి ఓ౦ ( 19 ) తీవ్ర గాయాలపాలు కాగా నాగపూరి సంకీర్త్ మృతి చెందినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement