Saturday, September 21, 2024

Peddapalli: కేటీఆర్ బహిరంగ సభతో ప్రతిపక్షాల్లో వణుకు.. ఎమ్మెల్యే దాసరి

జిల్లా కేంద్రంలో జరిగిన కేటీఆర్ బహిరంగ సభకు వచ్చిన జన ప్రవాహాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం మాట్లాడుతూ… మున్సిపల్ మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటమి కళ్ళ ముందు కనబడిందన్నారు.

ప్రజలందరూ గులాబీ పార్టీవైపే ఉన్నారని, మరోసారి రుజువు అయిందన్నారు. మూడోసారి ప్రతిపక్షాలకు ఓటమి తప్పదని, ఎన్నిదొంగ హామీలు ఇచ్చినా పెద్దపల్లి ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, నియోజకవర్గంలో గత 40ఏళ్లలో జరగని అభివృద్ధి 9ఏళ్లలో చేసి చూపామన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement