Sunday, May 19, 2024

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రూ.70 లక్షల‌తో ఎన్టిపిసి సిఎస్ఆర్ లతో నిర్మించిన ఎనిమిది అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్లాది రూపాయల ఖర్చు చేస్తుందన్నారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలు, మోడల్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎన్టిపిసి చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, డిఇఓ మాధవి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, జడ్పిటిసి బండారి రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement