Monday, May 20, 2024

టీటీడీ వారిచే భూకర్షణం కార్యక్రమం

కరీంనగర్ లోని పద్మనగర్ ప్రాంతంలో నిర్మించబడు వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో భూకర్షణం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్, జిల్లా కలెక్టర్ కర్నన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి – హరి శంకర్,మార్కెట్ ఛైర్మెన్ రెడ్డవెని మధు లు పాల్గొని గోవింద నామాలు స్మరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement