Friday, May 17, 2024

Peddapalli: అభివృద్ధి బీఆర్ ఎస్ తోనే సాధ్యం.. ఎమ్మెల్యే దాసరి

అభివృద్ధి భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం పట్టణానికి చెందిన మైనార్టీ నాయకుడు సయ్యద్ ఖదీర్ బీఆర్ఎస్ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ…బీఆర్ ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతిపక్షాల్లో గుబులు మొదలైందన్నారు.

ఆసరా పింఛన్లు రూ.3వేలకు పెంపు, వికలాంగుల పింఛన్ రూ.6వేలకు పెంపు, ప్రతి మహిళకు రూ.3 వేల పింఛన్, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15లక్షలకు పెంపు, రైతు బంధు 16 వేల రూపాయలకు పెంపు, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యంతో పాటు బీమా సౌకర్యం మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అమలవుతాయన్నారు. గత పాలకుల హయాంలో పెద్దపెల్లి అభివృద్ధికి నోచుకోలేదని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని పెద్ద పెళ్లిలో సైతం గులాబీ జెండా ఎగరడం ఖాయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement