Saturday, May 18, 2024

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ అండ

ఇల్లంతకుంట: పేద ప్రజల ఆరోగ్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిలుస్తుందని సర్పంచ్‌ పల్లె నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని అనంతగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రభుత్వం మంజూరు చేసిన సిఎంఆర్‌ఎఫ్‌ రూ.1.51,500ల చెక్కులను లబ్దిదారులకు సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీ-సీ గొట్టిపర్తి పరశురాములు అందజేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ను మాడుగుల శ్రీనివాస్‌ రెడ్డి రూ. 41వేలు, దొంతి కనుకయ్యకు రూ. 35వేలు, లెంకల హన్మంతుకు రూ. 25 వేలు, రెడ్డి ప్రేమల రూ.20 వేలు, చెలుపురి మధుసూదన్‌కు రూ. 17,500, యారా పద్మ రూ. 13 వేల చొప్పున అందించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బుర్ర బాలకిషన్‌, తెరాస గ్రామ అధ్యక్షుడు ముత్యం రెడ్డి, పంచాయితీ పాలకవర్గం, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement