Monday, April 29, 2024

TS: రాష్ట్రంలో బీఆర్ఎస్ దే అధికారం.. మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు

గోదావరిఖని, (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు తెలియజేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని అయినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు.

రామగుండంలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు. రామగుండంలో జరిగిన అభివృద్ధి మెడికల్ కళాశాల, సబ్ ట్రెజరీ కార్యాలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, చందర్ గెలిస్తేనే తిరిగి రామగుండం అభివృద్ధి చెందుతుందని గోనె ప్రకాష్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement