Sunday, May 5, 2024

BJP: తొలిజాబితాలో… ఉమ్మడి కరీంనగర్ లో 13 కు గానూ 9 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 52మందితో తొలి జాబితా ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 స్థానాలకు గానూ తొమ్మిది స్థానాలను ప్రకటించింది.

కరీంనగర్ నుండి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుండి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ నుండి ఈటల రాజేందర్, సిరిసిల్ల నుండి రాణి రుద్రమ, చొప్పదండి నుండి బొడిగె శోభ, మానకొండూరు నుండి ఆరేపల్లి మోహన్, జగిత్యాల నుండి బోగే శ్రావణి, ధర్మపురి నుండి ఎస్. కుమార్, రామగుండం నుండి కందుల సంధ్యారాణి లను అభ్యర్థులుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement