Friday, May 17, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 

గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మండ‌లంలోని ఈదుల గట్టేపల్లి పెట్రోల్ బంక్ వద్ద శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఈ మేర‌కు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement