Saturday, May 4, 2024

కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి..

సూర్యాపేట – ఐదు సంవత్సరాల మన తలరాతను, రాష్ట్ర ప్రగతిని నిర్ణయించే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రి బిఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్ చైతన్య స్కూల్ బూత్ నెంబర్ 95లో సతీమణి సునీత, కుమారుడు వేమన్ రెడ్డి, కూతురు లహరి ,కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు .

అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది, బలమైనది శక్తివంతమైనది అన్నారు.మన అధికారాన్ని ఇతరులకు ఇచ్చి పరిపాలించమని ఇచ్చే గొప్పఅవకాశం అయిన ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని వేయాలి అని కోరారు.ఓటు వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న మంత్రి,ఎన్ని అవాంతరాలు వచ్చినా సమయాన్ని కేటాయించి ఓటు వేయాలని సూర్యాపేట ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట లో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement