Friday, April 26, 2024

TS: కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం.. విద్యుత్‌ సిబ్బందిపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కరెంట్‌ కట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తామన్నారు. ప్రభుత్వం ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించట్లేదు.. కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఈ కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు.

అవసరాలకు సరిపడేంత విద్యుత్ ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వం తరుపున ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీరియస్ అయ్యారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement