Friday, May 3, 2024

పేదింటి అమ్మాయి పెళ్లికి ఉప్ప‌ల ఫౌండేష‌న్ చేయూత

హైద‌రాబాద్ : ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదింటి అమ్మాయి పెళ్లికి పుస్తె, మెట్టెలు విరాళంగా అందజేశారు. కర్ణాటక గుల్బర్గా కి చెందిన పేద కుటుంబం, మల్లేశ్ – పద్మల కూతురు భవాని వివాహం కోసం హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా పుస్తె మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు, సీహెచ్.పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement