Sunday, April 28, 2024

POW Sandhya: పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పీఓడ‌బ్ల్యూ సంధ్య భర్త రామకృష్ణ రెడ్డి ఈరోజు గుండె పోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సంధ్య భర్త మృతి గురించి తెలుసుకున్న వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు ఆమెను పరామర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement