Friday, May 3, 2024

26 నుంచి ఓయూ పీజీ తరగతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌, రెండో సంవత్సరం మూడో సెమిస్టర్‌ తరగతులు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. మూడో సెమిస్టర్‌ విద్యార్థులు పెండింగ్‌లో ఉన్న హాస్టల్‌/మెస్‌ బకాయిలను చెల్లించాలని సూచించారు. ఈనెల 26తర్వాతే హాస్టళ్లు తెరవబడతాయని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.

పలువురికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు…

ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతికి గానూ ఇంటర్వ్యూలు జరిగాయి. కమిటీ జరిపిన ఇంర్వ్యూల్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ రవీందర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొ.సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నట్లు తెలిసింది. వీరికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా హోదా కల్పించినట్లు తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement