Wednesday, May 1, 2024

HYD: ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి… మధుయాష్కి గౌడ్

కర్మన్ ఘాట్, నవంబర్ 24 (ప్రభ న్యూస్) : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, తమ ప్రభుత్వం రాగానే సెంట్రింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏర్పాటు కాగానే పరిష్కరించనున్నట్లు ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అన్నారు. చంపాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం మోహన్ రెడ్డి, అధ్యక్షులు దాచెర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కార్మిక అసోసియేషన్ చంపాపేట అధ్యక్షుడు వి. అంజనేయులుతో పాటు సుమారు 110మంది చంపాపేట్ లోని కార్యాలయంలో మధుయాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరితో పాటు కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ధర్మకర్త దుర్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అందరికీ భవనాలు నిర్మిస్తారు.. తమకు భవనం నిర్మించుకొనుటకు స్థలం కేటాయించాలని కోరారని, ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కే.సుభాష్, మల్లికార్జున్ రెడ్డి, రఘుపతి రెడ్డి, దయానంద్, వెంకటేష్, సిద్ధారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, బక్కయ్య, జంగారెడ్డి, రాములు గౌడ్, దశరథ్, బసవరాజ్, యాదయ్య, జిలాని, గంట సలందర్ రెడ్డి పార్టీలో చేరగా, ఈ కార్యక్రమంలో నోముల రవీందర్ గౌడ్, బద్రీనాథ్ గుప్తా, వరలక్ష్మి, గోపాల్ ముదిరాజ్, అనసూయ గౌడ్, తోకేటి కిరణ్, సుజాత, మొగిలిపు నారాయణ, యాదయ్య, భాగ్యలక్ష్మి, అనిత, సరిత, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement