Friday, May 17, 2024

పెండింగ్ పనులు పూర్తి చేయించండి – ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు వినతి

బాచుపల్లి, జులై 18( ప్రభ న్యూస్): నిజాంపేట్ కార్పొరేషన్ 18వ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని డివిజన్ ప్రజలు విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. 18వ డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి తో శ్రీహోమ్స్ కాలనీ ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి సంబంధిత కాలనీలో మరియు డివిజన్లో ఉన్న ప్రతీ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని విన్నవించారు.

అనంతరం ఎమ్మెల్సీ వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి పై అధికారులతో చర్చించి త్వరలో పెండింగ్ పనులను మరి ఇతర సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీహోమ్స్ కాలనీ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, యువ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement