Friday, May 3, 2024

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి – లోకేష్ కుమార్

బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ అన్నారు. 116వ బాబు జగ్జీవన్ రావ్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్తగా పేరుగాంచిన మహనీయుడని, ఆయన ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

భారత పార్లమెంటులో 45ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు చేపట్టడమే కాకుండా, ఉప ప్రధానిగా వ్యవహరించారని, అంతేకాకుండా అంటరానితనం నిర్మూలించేందుకు, సమానత్వం సాధించేందుకు విశేష కృషి చేశారని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు వి.కృష్ణ, విజయలక్ష్మి, సరోజ, యాదగిరి రావు, ఎస్ఇ కోటేశ్వర రావు, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, సీపీఆర్ఓ మొహమ్మద్ ముర్తుజా, సెక్రెటరీ లక్ష్మి, జాయింట్ కమిషనర్ సంధ్య, ఓ.ఎస్.డీ అనురాధ, ఏ.ఎం.సీ జీవన్ కుమార్, తదితరులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement