Monday, April 29, 2024

హైదరాబాద్ లో జాన్సన్ స‌రికొత్త‌ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ : భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్ విభాగం, హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 కంటే ఎక్కువ టైలింగ్ కాన్సెప్ట్‌లు, డిస్‌ప్లే మాక్-అప్‌లతో ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది JSP జూబ్లీ క్రౌన్, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -500 033 వద్ద ఉంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, జాన్సన్ డీలర్‌లతో పాటు హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) టాప్ మేనేజ్‌మెంట్ – టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ మిశ్రా, టైల్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, నర్సింగ్ రావు, ఇతరులు పాల్గొన్నారు. షోరూమ్‌ను టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ మిశ్రా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హోమ్ స్టైలింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై హౌస్ ఆఫ్ జాన్సన్ దృష్టి పెట్టిందన్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ జాన్సన్ బ్రాండ్ నుండి టైల్స్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్‌లు, ఇంజినీర్డ్ స్టోన్స్‌ను ఒకే గూటి క్రింద అందిస్తుందన్నారు. ఇది సరికొత్త డిజైన్‌లను అందించడమే కాకుండా ఎంపిక ప్రక్రియలో కస్టమర్‌ల విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుందన్నారు.

హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఒ శరత్ చందక్ మాట్లాడుతూ… హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ప్రపంచంలోని అగ్రశ్రేణి టైల్ తయారీదారుల్లో ఒకటి జాన్సన్ అన్నారు. నాణ్యత, ఉత్పత్తి ఆవిష్కరణలు కోసం ప్రసిద్ధి చెందిందన్నారు. హౌస్ ఆఫ్ జాన్సన్(లు)ని దేశవ్యాప్తంగా ప్రారంభించాలనే త‌మ లక్ష్యం గృహ పరిష్కారాలు, జీవనశైలి ఉత్పత్తుల కోసం కొనుగోలు, ఎంపిక ప్రక్రియను మెరుగు పరచడం లో భాగమ‌న్నారు. టైల్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు మాట్లాడుతూ… ఈ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ త‌మ విశ్వసనీయ ఛానెల్ భాగస్వాములతో త‌మ బలమైన వ్యాపార సంబంధాలను కొనసాగించడానికి, త‌మ బంధాన్ని బలోపేతం చేయడంలో త‌మకు సహాయపడుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement