Sunday, April 28, 2024

TS : జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను క‌లిసిన కార్పొరేట‌ర్

ఎల్బీనగర్, ఫిబ్రవరి 28(ప్రభ న్యూస్) : జిహెచ్​ఎంసి కమిషనర్​ రోనాల్డ్ రోస్​ను బీఎన్​రెడ్డి నగర్​ కార్పొరేటర్​ మొద్దు లచ్చి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రోడ్లు,డివిజన్ శివారులో ఉన్న కాలనీలకు,కరెంటు స్తంభాలు,వీధి దీపాలు, సంక్షేమ సంఘం భవనలు ఒకటొకటిగా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement