Thursday, April 25, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటుడు సముద్రఖని

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టి ..దిగ్విజయంగాకొనసాగిస్తున్నారు. కాగా తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు న‌టుడు..ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని. ఇటీవలే దర్శకుడు ఎం. శశికుమార్ ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి సముద్రఖనికి ఛాలెంజ్ విసిరారు. దీంతో ఈ ఛాలెంజ్ ను స్వీకరించి హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్క నాటారు సముద్రఖని. ప్రతి ఒక్కరు దీన్ని సామాజిక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని సముద్రఖని పిలుపునిచ్చారు. అనంతరం పచ్చటి కండువాను తలకు ధరించి తాను నాటిన మొక్కతో సముద్రఖని సెల్పీ దిగారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తన బిడ్డలను కూడా భాగస్వామ్యం చేయనున్నట్లు సముద్రఖని పేర్కొన్నారు. అందుకోసమే తన తనయుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీతో పాటు దర్శకుడు వినోద్ కు ఈ గ్రీన్ ఇండియా విసురుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement