Monday, October 21, 2024

TS: ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య..

ప్రభ న్యూస్ నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో జైనథ్ మండలం మేడిగూడ విధులకు తొలి రోజు హాజరయ్యేందుకు మోటార్ బైక్ పై వెళ్తున్న ఉపాధ్యాయుడు గజేందర్ ను గుర్తు తెలియని వ్యక్తులు నార్నూర్ మండలం అర్జుని- లోకారి వద్ద అడ్డగించి హతమార్చారు.

తన స్వగ్రామం నాగలకోయ నుండి బైక్ పై బయలుదేరిన ఉపాధ్యాయున్ని గుర్తుతెలియని వ్యక్తులు దారిలో కాపు కాచి బండరాళ్లతో తలపై కొట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. గజేందర్ ఆదిలాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్టు తెలిసింది. కుటుంబ తగాదాల కారణంగా ఈ హ‌త్య జ‌రిగి ఉంటుందేమోన‌ని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement