Friday, May 10, 2024

Breaking: శ్రీరాముడి పట్టాభిషేకానికి గవర్నర్‌.. రైలులో ప్రయాణించిన తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్‌ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు. తమిళిసై గవర్నర్‌ హోదాలో తొలిసారిగా రైలులో ప్రయాణించారు. భద్రాచలం క్షేత్రంలో కల్యాణ రామయ్యకు నేడు పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ సౌందరరాజన్‌ హాజరు కానున్నారు. అనంతరం గిరిజన మహిళల సీమంతం వేడుకలో పాల్గొంటారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రం పనితీరును సమీక్షిస్తారు. నాచారం జయలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. ఇక, పర్యటనలో భాగంగా రేపు పూసకుంట, గోగులపూడి గిరిజనులను సమస్యలను గవర్నర్ తెలుసుకోనున్నారు. అలాగే మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌ను సందర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement