Sunday, April 28, 2024

TS | సాంస్కృతిక సారధి ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. పీఆర్సీ అమలు, పెరగనున్న జీతం!

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. వారికి పీఆర్సీ అమలుచేస్తూ సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి రానుంది. పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1వ తేదీ నుంచి వర్తింపు చేయనున్నట్టు ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశించింది. మూడు నెలల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుత పే స్కేలు మీద వీరందరికీ 30% పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹ 24,514 ఉండగా..
ఒక్కొక్కరికి ₹ 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement