Monday, April 29, 2024

HYD: ఘ‌నంగా సీతారాముల క‌ళ్యాణం… కేటీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీరామనవమి సందర్భంగా కూకట్‌పల్లిలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో, సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేటీఆర్ శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అట్టహసంగా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement