Sunday, April 28, 2024

WGL: బట్టలు ఉతికేందుకు వెళ్ళి.. క్వారీ గుంత‌లో ప‌డి బాలిక మృతి..

ప్రభన్యూస్ ప్రతినిధి, మహబూబాబాద్ : బట్టలు ఉతికేందుకు క్వారీ గుంత‌కు వెళ్ళిన 11ఏండ్ల బాలిక ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిన దుర్ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తీ గార్డెన్స్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 6వ తరగతి చదువుతున్న బోడా నిఖిత అనే బాలిక శనివారం తన అక్కా, చెల్లెలు, స్నేహితురాలితో కలిసి బట్టలు ఉతికేందుకు ఆర్తీ గార్డెన్స్ పక్కనే ఉన్న క్వారీ గుంటకు వెళ్ళింది.

ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి ఆ గుంతలో పడిపోవడంతో తోడుగా వెళ్ళిన బాలికలు పెద్ద ఎత్తున రోధిస్తూ వెళ్ళి సమాచారాన్ని ఇంటికి చేరవేశారు. కాలనీవాసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నప్పటికీ నిఖిత అప్పటికే మృతిచెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement