Sunday, April 28, 2024

TS: సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి..

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 16 (ప్రభ న్యూస్) : బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.. ఇటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ కు వచ్చిన వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వేణుగోపాల చారి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పార్టీని వదిలి వెళ్ళడం బీఆర్ఎస్ పార్టీకి భారీ కోలుకొని దెబ్బగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement